ఇండియా వేదిక ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి..
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇండియా వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు సురేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప సిపిఎం నాయకులు నాగేంద్ర,రఫీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రేపు నార్పల మండల కేంద్రంలో గాంధీ సర్కిల్ నందు సాయంత్రం నాలుగు గంటలకి ఇండియా వేదిక ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ ను గెలిపించాలని కోరుతూ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, సిపిఐ నాయకులు పాల్గొంటారు.
రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు బిజెపికి తొత్తులుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసి నాటకాలు ఆడుతున్న బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని పరోక్షంగా మద్దతు ఇస్తూ వైసిపి రాజధాని ఎక్కడో తెలియని స్థితిలోకి నెట్టింది. సింగనమల నియోజకవర్గం లో అవినీతి అక్రమాలు బాగా పెరిగాయని 2014 ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన అనేక పనులు, సంక్షేమ పథకాలను ఇప్పటికీ అమలులోకి నోచుకోలేదు. గార్లదిన్నె ఐదవ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఆధునికరణ పనులు, సింగనమల నియోజకవర్గంలోని రాచేపల్లి లెదర్ పార్కును మూసివేసి ఏళ్లు గడుస్తున్నా పునరుద్ధరణ చేయలేదు, నార్పల లో డిగ్రీ కళాశాల, పుట్లూరులో జూనియర్ కళాశాల ప్రారంభించలేదు. ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. పాలక పార్టీలు వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం మానేశాయి. ఈ పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాతంత్ర హక్కుల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇండియా వేదిక రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర కలిసి వచ్చే పార్టీలతో అవగాహన చేసుకుని ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. సింగనమల నియోజకవర్గం నుండి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించాలని కోరుతూ రేపు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Apr 19 2024, 07:25